9, ఫిబ్రవరి 2013, శనివారం

నలంద

తొలి విజ్ఞానఖని నలంద
ప్రపంచంలోనే అత్యంత పురాతన విశ్వవిద్యాలయాల్లో నలంద విశ్వవిద్యాలయం ఒకటి. నాగరికత పురుడుపోసుకుంటున్న ప్రాచీన కాలంలోనే ఈ విశ్వ విద్యాల యంలో.. గణిత, విజ్ఞాన, వైద్య, తర్క శాస్ర్తాలు ఎనలేని ఆదరణ చూరగొన్నారుు. వివిధ దేశాల నుండి ఎందరో విద్యార్థులు 11వ శతాబ్దంలోనే ఇక్కడ విద్యనభ్యసించారు. నేడు ప్రపంచం లోనే పేరిన్నికగన్న.. ఆక్స్‌ఫర్డ్‌, ేకంబ్రిడ్గ్జ విశ్వవిద్యాలయాలకంటే ముందే భారతదేశంలో.. ‘నలంద’ విజ్ఞానఖనిగా నిలిచింది. క్రీస్తుశకం 427 నుండే నలంద బౌద్ధ విజ్ఞాన ేకంద్రంగా వెలుగొందింది. బిహార్‌ రాష్ట్రంలో ఉన్న ఈ విశ్వవిద్యాలయ శిథిలాలు.. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన పర్యాటక ేకంద్రంగా వెలుగొందుతోంది.
Nalanda-sariputta
నేటి ఆధునిక గణిత, వైద్యశాస్త్ర పరిశోధనాలయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆనాడే.. నలంద విశ్వవిద్యాలయం శస్త్ర విద్యలో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ కంటి పొరలు, గర్భకోశం నుంచి మృత పిండాన్ని తీయడం వంటి శస్త్ర చికిత్సలు చేసేవారంటే అతిశయోక్తి కాదు. మానవుల తోపాటు ఇక్కడ జంతువులకు కూడా పరిపూర్ణమైన వైద్య సౌకర్యం ఉండేది. ఇక్కడ పొరుగు దేశాలైన చైనా, టిబెట్‌, జావా, సమత్రా, కొరియా, గ్రీసు, ఇరాన్‌, అరేబియాల నుంచి విద్య నేర్చుకోవడానికి విద్యార్ధులు నలందకు వచ్చేవారు. 10 సంవత్సరాలకు పైగా ఉండి తర్క, వైద్య, ఖగోళ శాస్త్ర సంబంధమైన విషయాలు నేర్చుకునేవారు.

బిహార్‌ రాజధానికి పాట్నాకు ఆగ్నేయంగా 55 మైళ్ళ దూరంలో ఉన్న నలంద విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయం. నలంద అంటే సంస్కృతంలో జ్ఞానాన్ని ఇచ్చేది అని అర్ధం. నలంద అనే సంస్కృత పదం ‘నలం’ అనగా కమలం అని అర్ధం (కమలం జ్ఞానికి చిహ్నం). ‘ద’ అంటే ఇవ్వడం అనే రెండు పదాల కలయిక ద్వారా పుట్టిందే ‘నలంద’. అనగా జ్ఞానప్రదాయిని అని అర్థం. చైనా తీర్థయాత్రికుడు హ్యూయన్‌ త్సాంగ్‌ నలంద పదానికి వివిధ వివరణలు ఇచ్చాడు. ఒక వివరణ ప్రకారం నలందకు ఆ పేరు మామిడి తోపు మధ్యన ఉన్న చెరువులో నివసించే నాగుని వలన వచ్చింది. హ్యూయన్‌ త్సాంగ్‌ సమ్మతించిన రెండవ వివరణ ప్రకారం ఒకప్పుడు బోధిసత్వుని రాజధాని ఇక్కడ ఉండేదని, ఆయన నిరంతర దానాలు చేసేవాడని అందుకే ‘నలంద’ అన్న పేరు వచ్చిందని వివరించాడు.

గౌతమ బుద్ధుని కాలంలో...
నలంద విశ్వవిద్యాలయం క్రీశ.427 నుంచి క్రీ.శ.1197 వరకూ బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా ఉండేది. పాక్షికంగా పాల వంశ పాలనలో ఉన్నది. ఇది లిఖిత చరిత్రలో ప్రపంచంలోని తొలి విశ్వ విద్యాలయాలలో ఒకటి. అలెగ్జాండర్‌ కన్నింగ్‌హాం నలందను బారాగావ్‌ గ్రామంగా గుర్తించాడు. బుద్ధుడు చాలాసార్లు నలంద చుట్టు పక్కల ప్రాంతంలో తిరిగాడని, అక్కడ కొన్ని రోజులు ఉన్నాడని అంటారు. బుద్ధుడు అనేక పర్యాయములు నలందలో ఉన్నాడని చరిత్ర చెబుతోంది. ఆయన నలందను సందర్శించినప్పుడు అక్కడ ఉన్న మామిడితోపులో బస చేసేవాడట.

Nalanda_Universityఅక్కడ ఉండగా ఉపాళీ-గహపతి, దీఘాతపస్సీలతో చర్చలు జరిపేవాడు. కేవత్త, అసిబంధకపుత్తతో కూడా అనేక చర్చలు జరిపినట్టు తెలుస్తున్నది. బుద్ధుడు మగధ గుండా తన చివరి యాత్రలో నలందను సందర్శించాడు. సారిపుత్త, తను చనిపోయే కొద్దికాలం ముందు ఇక్కడే బుద్ధుని యెడల తన విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ సింహగర్జన చేశాడు. రాజగృహ నుండి నలందకు వెళ్ళే మార్గం అంబలత్తికా గుండా వెలుతుంది. అక్కడి నుండి ఆ మార్గం పాతాలీగామా వరకు వెళ్ళేది. రాజగృహకు, నలందకు మధ్యన బహుపుత్త చేతియ ఉన్నది.

కేవత్త సుత్త ప్రకారం... బుద్ధుని కాలానికే నలంద ప్రాముఖ్యత కలిగి నిండు జనాభాతో వృద్ధి చెందుతున్న నగరం. అయితే ఆ తరువాత చాలాకాలానికి గానీ విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందలేదు. సమ్యుత్త నికాయలోని, ఒక రికార్డులో నలంద బుద్ధునికాలంలో తీవ్ర క్షామానికి గురైనదని నమోదు చేయబడినది. బుద్ధుని కుడిభుజం వంటి ఆయన శిష్యుడైన సారిపుత్త నలందలోనే పుట్టి, ఇక్కడే మరణించాడు. నలంద, సొన్నదిన్న యొక్క నివాసస్థలం. ఒకప్పుడు జైనమత కార్యకలాపాలకు కేంద్రమైన నలందలో మహావీరుడు అనేక పర్యాయములు బసచేసినాడని పేర్కొనబడినది. మహావీరుడు నలందలో ఉన్నపవపురిలో మోక్షాన్ని పొందినట్టుగా భావిస్తారు.

(అదేకాక జైనమతంలోని ఒక తెగ ప్రకారం, మహావీరుడు నలంద సమీపాన ఉన్న కుందల్‌పూర్‌లో జన్మించాడు). అశోకుడు క్రీస్తుపూర్వం 250లో ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. టిబెట్‌ మూలాల ప్రకారం, నాగార్జునుడు నలంద విశ్వవిద్యాలయములో బోధించాడు. చరిత్రకారుల ప్రకారం ఈ విశ్వవిద్యాలయం క్రీశ 1193 వరకు ఉన్నతస్థాయిలో వర్థిల్లింది. దీనికి ప్రధానకారణం బౌద్ధచక్రవర్తులైన హర్షవర్ధనుడు వంటివారు. పాలివంశానికి చెందిన రాజుల ఆదరణే కారణం.

బౌద్ధమతంపై నలంద ప్రభావం...
nalanda-university9 - 12 వ శతాబ్దం మధ్యకాలంలో ప్రజ్వరిల్లిన టిబెటన్‌ బౌద్ధత్వం (వజ్రాయన) నలంద బోధకుల నుండి, సంప్రదాయాల నుండే ఉద్భవించింది. వియత్నాం, చైనా, కొరియా, మరియు జపాన్‌లలో అనుసరించే మహాయాన బౌద్ధం పుట్టుక కూడా ఈ విశ్వ విద్యలయ ప్రాంగణంలోనే జరిగిందంటే అతిశయోక్తి కాదు. థెరవాడ బౌద్ధం కూడా నలందలో బోధించబడినది. కానీ థెరవాడ బౌద్ధానికి నలంద గట్టి కేంద్రం కాకపొవడం వల్ల, తరవాతి అభివృద్ధి ఇక్కడ జరగలేదు.

పతనావస్థ...
1193లో నలంద విశ్వవిద్యాలయ సముదాయాన్ని, భక్తియార్‌ ఖిల్జీ నాయకత్వంలో తురుష్క సేనలు దండెత్తి కొల్లగొట్టాయి. ఈ సంఘటన భారతదేశంలో బౌద్ధమత క్షీణతకు మైలురాయిగా భావిస్తారు. నలందను కొల్లగొట్టే ముందు ఖిల్జీ అక్కడ ఖురాన్‌ ప్రతి ఉందా అని వాకబు చేశాడని చెబుతారు. 1235లో టిబెట్‌ అనువాదకుడు ఛాగ్‌ లోట్స్‌వా నలందను సందర్శించినపుడు కొల్లగొట్టబడి జీర్ణవస్థలో ఉన్నప్పటికీ కొద్దిమంది బౌద్ధ భిక్షువులతో పనిచేస్తూ ఉన్నది. గణితం, ఖగోళశాస్త్రం, రసాయన శాస్త్రం, స్వరూపశాస్త్రం మొదలగు శాస్త్రాలలో ప్రాచీన భారతీయ విజ్ఞానం అకస్మాత్తుగా అంతరించిపోవడానికి నలంద విశ్వవిద్యాలయ నాశనం, ఉత్తర భారతదేశమంతటా ఇతర దేవాలయాలు, ఆశ్రమాల నాశనమే కారణమని అనేకమంది చరిత్రకారులు భావిస్తారు. దండయాత్రల ప్రధాన మార్గంలో ఉన్న ఇక్కడి సన్యాసాశ్రమాలన్నీ కూలగొట్టబడినవి. ప్రధాన మార్గంలో లేకపోవడం నలంద, బుద్ధగయ మిగిలాయని చెబుతారు. ప్రధాన మార్గంలో లేని, ఉత్తర బెంగాల్‌ లోని జగద్దలా ఆశ్రమం వంటి అనేక ఆశ్రమాలు ఏ మాత్రం హానిలేకుండా ఉండి వృద్ధి చెందినవి.

భారత విజ్ఞాన వినాశనం...
పర్షియన్‌ చరిత్రకారుడు మిన్నాజ్‌-ఈ-సిరాజ్‌ తన తబాకత్‌ - ఇ - నసిరీన్‌ అనే రచనలో నలంద విశ్వవిద్యాలయ నాశనాన్ని ఇలా వర్ణించాడు. ‘‘విశ్వవిద్యాలయంపై దాడి సందర్భంలో వేలాదిమంది బౌద్ధ సన్యాసులు, విద్యార్థులు సజీవదహనం చేయబడ్డారు. మరికొన్ని వేలమంది తలలు తెగ నరకబడ్డాయి. బ్రహ్మాండమైన గ్రంథాలయం తగలబెట్టబడింది. అది కొన్ని నెలలు పాటు తగలబడింది. తగలబడుతున్న పుస్తకాల నుండి చెలరేగిన పొగ ఆకాశంలో కొన్ని వారాల పాటు నల్లగా, చిక్కగా కమ్ముకుంది’’ అని వివరించాడు.

సందంట్లో సడేమియా అన్నట్లుగా ఈ విశ్వవిద్యాలయం వినాశనంలో హిందూ మతోన్మాదులు కూడా ఒక చేయి వేశారు. శర్మ స్వామి అనే టిబెట్‌ యాత్రికుడు భక్తియార్‌ ఖిల్‌జీ దాడి తర్వాత మూడు దశాబ్దాలకు నలంద విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, అక్కడ జరిగిన దుర్మార్గాన్ని వర్ణించాడు. దీని ప్రకారం ఖిల్‌జీ దాడి అనంతరం నెలకొని ఉన్న అరాచక వాతావరణంలో కొందరు హిందూ సన్యాసులు ఒక యజ్ఞాన్ని ఆ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించారు. తర్వాత యజ్ఞం తాలూకు నిప్పుల కట్టెలను వారు అన్నిచోట్లా విసిరేశారు. అవి మంటలను సృష్టించాయి. ఆ మంటల్లో అప్పటికీ మిగిలి ఉన్న రత్నబోధిలోని గ్రంథాలన్నీ తగలబడ్డాయి.

ఆ తొమ్మిది అంతస్థుల భవనంలోని విజ్ఞాన భాండాగారం నాశనమైపోయింది. దీనితో నలంద విశ్వవిద్యాలయం, దానిలో విజ్ఞానశాస్త్ర భాండాగారం చరిత్రగర్భంలో కలిసిపోయాయి. ‘అహి’ అనే చరిత్రకారుని ప్రకారం, ‘‘నలంద విశ్వవిద్యాలయంలోని బోధనా ప్రదేశాలు, గ్రంథాలయాల వినాశనం, ఖగోళశాస్త్రం, లెక్కలు, రసాయనిక శాస్త్ర, వైద్యశాస్త్రంలో భారతీయ శాస్ర్తీయ ఆలోచనా విధానం యొక్క వినాశనానికి మూలమని అంగీకరించక తప్పదు.

పునరుద్ధరణ...
డిసెంబర్‌ 9, 2006న న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక 1 బిలయన్‌ డాలర్లు ఖర్చుచేసి ప్రాచీన విశ్వవిద్యాలయమున్న చోటను పునరుద్ధరించటానికి ఓ ప్రణాళికను వివరించింది. సింగపూర్‌ నేతృత్వంలో భారత్‌, జపాన్‌, ఇతర దేశాలతో కలసి ఒక కన్షార్షియంగా ఏర్పడి 500 మిలియన్‌ డాలర్లతో కొత్త విశ్వవిద్యాలయం నిర్మించటానికి, మరో 500 మిలియన్‌ డాలర్లు దానికి అవసరమయ్యే సదుపాలను అభివృద్ధి చేయటానికి నిధులు సేకరించడానికి ప్రయత్నిస్తున్నది.

విశ్వవిద్యాలయ చరిత్ర...
Nalanda_Universityచారిత్రక ఆధారాల ప్రకారం నలంద విశ్వ విద్యాలయము గుప్తరాజుల, ముఖ్యంగా కుమార గుప్త, సహాయంతో క్రీస్తుశకం 450లో నిర్మించబడినది. నలంద ప్రపంచంలోనే మొట్ట మొదటి ఆవాస విశ్వవిద్యాలయం. అంటే ఈ విద్యాలయంలో విద్యార్థుల కొరకు వసతి గృహాలు ఉండేవి. ఇందులో షుమారుగా పదివేల మంది విద్యర్థులు, రెండువేల మంది బోధకులు ఉండేవారు. పెను గోడ ద్వారాలతో ఈ విశ్వ విద్యాలయము ‘అతి ఘనమైన కట్టడం’ గా గుర్తించబడినది. నలందలో ఎనిమిది ప్రత్యేక ఆవరణలు, పది గుళ్లు, లెక్కకు మించిన ధ్యాన మందిరాలు, తరగతి గదులు ఉండేవి.

ఆవరణలో కొలనులు, ఉద్యానవనాలు ఉండేవి. గ్రంధాలయం ఒక తొమ్మిది అంతస్తుల భవనంలో ఉండేది. ఇందులో ఎన్నో గ్రంధాల ములాలు ఉన్నవి. నలంద విశ్వ విద్యాలయంలో బోధింపబడే విషయాలు ప్రతి విజ్ఞాన శాఖనూ స్పర్శించాయు. నలంద విద్యార్ధులను, బొధకులను కొరియా, జపాన్‌, చైనా, టిబెట్‌, ఇండోనేషియా, పర్షియా, టర్కి వంటి దేశాల నుండి ఆకర్షించింది. తాంగ్‌ వంశానికిచెందిన చైనా తీర్థ యత్రికుడు హ్యుయాన్‌ త్సాంగ్‌ 7వ శతాబ్ధపు నలంద విశ్వ విద్యాలయం గురించి వివరాలు సంగ్రహపరిచాడు.

అవశేషాలే.. నేటి పర్యాటక కేంద్రాలు..
100_0388జీర్ణావస్థలో ఉన్న కట్టడాలు.. ఆనాటి విజ్ఞానపు తాలూకు వాసనలు వెదజల్లుతూ.. ఇంకా మిగిలే ఉన్నాయి. దగ్గరలో ఒక హిందూ దేవాలయమైన సూర్య మందిరం ఉన్నది. పురాతత్వ శాఖ లెక్కల ప్రకారం.. అవశేషాలు 150,000 చదరపు మీటర్ల మేరకు విస్తరించి ఉన్నవి. హువాన్‌ త్సాంగ్‌ యొక్క వర్ణన ప్రకారం నలంద విస్తృతిని, ఇప్పటి వరకు త్రవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని పోల్చి అంచనా వేస్తే, ఇంకా 90% శాతం దాకా అవశేషాలు బయల్పడనట్టే.

నలంద ఇప్పుడు నిర్వాసితము. ప్రస్తుతం ఇక్కడికి అతి చేరువలోని జనవాస ప్రదేశం బార్‌గాఁవ్‌ అనే గ్రామం. 1951లో నవ నలంద మహావిహార అనే ఒక ఆధునిక పాళీ, థెరవాడ బౌద్ధ అధ్యయన కేంద్రాన్ని ఇక్కడికి దగ్గరలో స్థాపించబడినది. ప్రస్తుతం, ఆ కేంద్రం ఈ పరిసర ప్రాంతాన్ని మొత్తం ఉపగ్రహం ద్వారా శాటిలైట్‌ ఇమేజింగ్‌ పద్ధతిలో అధ్యయనం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నది. నలంద మ్యూజియంలో అనేక వ్రాతపత్రులు, త్రవ్వకాలలో దొరికిన వస్తువులను ప్రదర్శనకు ఉంచారు.

28, జనవరి 2013, సోమవారం

బుద్ధుని ప్రతిమలు


బుద్ధుడు ఎన్ని రకాలో!

 ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి అంటూ మానవజాతికి సత్యాన్ని బోధించిన గౌతమ బుద్ధుని ప్రతిమలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు వెయ్యిరకాలుగా ఉన్నాయి. ధ్యానముద్ర, ధర్మచక్ర ప్రవర్తన ముద్ర, అభయముద్ర, భూ స్పర్శముద్ర, మహాపరినిర్యాణ ముద్ర, సుఖాసీన ముద్ర, వాకింగ్‌ ముద్ర, లాఫింగ్‌ ముద్ర తదితర ప్రతిమలు ఉన్నాయి. ఖేరవాదం, మహాయానం, వజ్రయానం అనే మూడు దశల్లో బౌద్ధమతం వ్యాపించింది. ఖేరవాదంలో కేవలం బుద్ధుని వచనాన్ని మాత్రమే ప్రమాణీకంగా తీసుకుని ఆచరించే వారు. బుద్ధుని చిహ్నలను మాత్రమే కొలచే ఈ వాదంప్రకారం బౌద్ధబిక్షులు వారికి మాత్రమే బౌద్ధాన్ని అనున్వయించుకుంటూ నిర్యాణాన్ని పొందేవారు. బుద్ధుని మహాభినిష్క్రమణ ను గుర్రంతోనూ, సంబోధి పొందడాన్ని బోధవృక్షంతోనూ, ధర్మచక్రప్రవర్తనం ను జింకలతోనూ, మహాపరినిర్యాణాన్ని స్తూపం చిహ్నం తోనూ కొలచేవారు. ఆ తరువాత మహాయానంలో బుద్ధుని ఆరాధన ప్రారంభమై వివిధ రూపాల్లో బుద్ధుని విగ్రహలు రూపుదాల్చాయి. క్రీ.శ. 1 నుంచే బుద్ధిని విగ్రహారాధన ప్రారంభమైనట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ విగ్రహాలు ముఖ్యంగా మూడు శైలిల్లో ఉండేవి. గాంధార శైలీ ప్రస్తుతం విదేశాల్లో ఉన్న బుద్ధుని ప్రతిమలన్నీ ఈ శైలీకే చెందుతాయి. గ్రీక్‌ లో లభ్యమైన బుద్ధునిరూపం మీసాలతో కనిపిస్తుంది.

మధుర శైలి
ఉత్తర భారతదేశంలో లభ్యమైన, ప్రస్తుతం ఆధారిస్తున్న బుద్ధప్రతిమలన్నీ ఈ రకానికి చెందినవి. సహజ సుందర మూర్తి, ఉబ్బెత్తు ప్రతిమలు కనిపిస్తాయి. శాంచీ, గయ, సార్‌నాథ్‌ తదితర ప్రాంతాల్లో ఉన్న విగ్రహాలు ఇందుకు ఉదాహరణ.

అమరావతి శైలి
దక్షణ భారతదేశంలో లభించిన బుద్ధుని ప్రతిమలు ఈ రకానికి చెందినవి. 1924, 1926, 1928 సంవత్సరాల్లో జరిగిన తవ్వకాల్లో నాగార్జునకొండ లో లభించిన విగ్రహాలన్నీ అమరావతి శైలీలో ఉన్నవే. కుడిభుజంపై వస్త్రం లేకుండా, ఎడమభుజంమీదుగా వచ్చిన వస్త్రం శరీరదిగువ భాగాన్ని కప్పబడినట్లు, బిగించిన ఎడమచేయి పైకెత్తి పట్టినట్లుగా ఈ విగ్రహాలు ఉంటాయి.

 



నాలుగు సంకల్పాలు


నాలుగు  సంకల్పాలు
 
దివ్య జనని శారదా మాత ఒక విలువైన మాటను ఎల్లపుడూ చెప్పేవారు. మనిషి అత్యంత జాగ్రత్తగా జీవించాలి. అతని ప్రతి సంకల్పమూ, చర్యా చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఎందుకంటే ఈ సంకల్పాలు చర్యలు అనేవాటివల్లె మనిషి మనస్సులో వాసనలు కలుగుతాయి. ఈ వాసనా బలమే తరువాత అతడు మంచి లోకాలలో జన్మిస్తాడా లేక అధమ లోకాలలో జన్మిస్తాడా, మంచి పుట్టుక కలుగుతుందా లేక నీచమైన పుట్టుక కలుగుతుందా అనే విషయాన్ని నిర్ణయిస్తాయి.

ప్రతి వానికి తానూ మంచి కుటుంబంలో పుట్టాలి తనకు అంతా మంచే జరగాలి అనే ఉంటుంది. కానీ అలా జరగదు. కారణం? తన పూర్వ కర్మలు తన ఆలోచనలు సంకల్పాలు చర్యలు ఇవే కారణం.
అంతిమంగా మన భావనలే మన మిత్రులు అవే మన శత్రువులు. యోగ వేదాంత శాస్త్రముల ప్రకారం మనిషి యొక్క భావనలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది.

ఈ పూర్వ రంగంలో, భగవాన్ బుద్ధుని అత్యంత
ప్రధాన బోధనలలో ముఖ్యమైనవి అయిన నాలుగు బ్రహ్మ విహారాలను గురించి చూద్దాం.

అవే మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. తన శిష్యు లందరికీ ఈ నాలుగు గుణాలను పరిపూర్ణంగా, అనంతంగా, వారువీరనక, శత్రువులు మిత్రులు ఎల్లరి యందూ చూపించేలా అభ్యాసం చెయ్యమని బుద్దుడు ఆదేశించాడు.

ధ్యాన అభ్యాసి ఈ నాలుగు గుణాలనూ ప్రతిరోజూ లోతైన ధ్యానం చెయ్యటం ద్వారా తనవిగా చేసుకొనడం ద్వారా అతడు ఉన్నత లోకాలను పొందగలడు. మరణానంతరం వ్యధా భరితములైన తక్కువ లోకాలలో జన్మించటం జరుగదు. జీవించినంత కాలం చెదరని మనో నిశ్చలత తో అతడు జీవించగలడు. మరణం తరువాత బ్రహ్మ లోకాన్ని అతడు చేరుకుంటాడు.

ఈ నాలుగు బ్రహ్మ విహారాలు బ్రహ్మ లోకంలో ఉండే ఉన్నత తరగతికి చెందిన జీవులకు సహజంగా ఉండే లక్షణాలు . బ్రహ్మ లోకం అంటే ఊర్ధ్వ లోకాలలో చాలా పైది అని తలచవచ్చు. జంతులోకానికి మన లోకానికి చాలా భేదం ఉంది. ఆ సంగతి మనకు తెలుసు. అలాగే మనకు దేవతా లోకాలకు భావనలలో, అనుభవాలలో, పరిస్తితులలో చాలా తేడా ఉంటుంది. ఈ లోకాలలో ఉండే జీవులను దేవతలు అని మనం తలచ వచ్చు. ఈ గుణాలు పరిపూర్ణం గా అభ్యాసం చెయ్యటం వలన మానవుడు దేవతా స్థానాన్ని పొందగలడు. వారి గుణాలను తనవిగా చేసుకోవటం వల్ల వారి లోకాన్ని అతడు పొంద గలడు .

>మైత్రి:

సాధారణంగా
మానవులకు ఉండే సహజ గుణం ఓర్వలేనితనం మరియు ద్వేషం. మైత్రీ గుణాన్ని ఎల్లలులేకుండా అభ్యాసం చెయ్యటం ద్వారా మనిషి లో మైత్రీ భావన నిండుతుంది. అతనికి ఈ భూమ్మీదే కాదు ఇతర ఏ లోకంలోనూ శత్రువులు అంటూ ఉండరు. క్రూర జంతువులు సైతం అతని సమక్షంలో తమ సహజ స్వభావాన్ని వదలి సాదుజంతువులుగా మారతాయి. ఇక మనుషుల మాట చెప్పేదేమి?

మనసులో మైత్రీ భావనతో ఉన్న మనిషి ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతో ఉండగలడు. ప్రసన్న చిత్తం కలిగి ఉండటం ద్వారా ముందు సాధకునికే ఎంతో మంచి జరుగుతుంది. అనవసర ఆదుర్దాలు ఆందోళనలు లేకపోవటం వల్ల శారీరిక మానసిక ఆరోగ్యం బాగుంటుంది.

ఈ భావనా అభ్యాసం వల్ల సాధకుడు మనో ప్రశాంతతను పొందగలడు. ద్వేష భావం నుంచి విముక్తుడు కావటంతో అతనికి మనసు ఎల్లప్పుడూ తేలికగా సంతోషంగా ఉంటుంది. ఎవరిని చూచినా అతనికి ద్వేష భావం కలుగదు. మైత్రీ భావం తో నిండి ఉండటంతో ముల్లోకాలలో ఎవ్వరితోనూ అతనికి శత్రుత్వం ఉండదు.

>కరుణ:

మోహ
గ్రస్తులై చరిస్తున్న మానవులను ఇతర జీవకోటిని తలచి ఈ కరుణా భావనను అభ్యాసం చెయ్యాలి. గొప్ప దైన దైవీ సంపదను పొందగలిగే అవకాశాన్ని కలిగి ఉండి కూడా మానవులు ఇంద్రియ వ్యామోహ పరులై తాను రాజునన్న సంగతి మరచి చిల్లరకోసం పరిగెత్తే మూర్ఖుని వలె ప్రవర్తిస్తూ ఉన్నారు. అజ్ఞాన పీడితులై జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూ అనేక బాధలు పడుతూ ఉన్నారు. తమ కర్మలు తమను పట్టి బంధించే పాశాలన్న సంగతి తెలియక క్షణిక లాభాలకోసం ఆరాట పడుతూ చెయ్య రాని పనులు చేస్తూ దుస్సంస్కారాలను పోగేసుకొని తమ అధోగతికి మెట్లను తామే నిర్మించుకుంటున్నారు.
సమస్త ప్రపంచాన్నీ కట్టి నడిపిస్తున్న అజ్ఞాన భ్రాంతి ఎంత గొప్పది? ఈ అజ్ఞాన సీమ ఆవల ఎంతటి తేజోమయ లోకాలున్నాయి. వాటి సంగతి తెలియక మానవులు భ్రాంతిలో మునిగి ఇదే సర్వస్వం అనుకొని పంచేంద్రియ భోగాల కోసం తుచ్చమైన కర్మలు చేస్తూ క్షణ క్షణానికి ఊబిలో కూరుకొని పోతున్న వాని వలె తమ వినాశాన్ని తామే కొని తెచ్చుకుంటున్నారు. సమస్త లోకాలూ వాటిలోని జీవులు ఇదే తీరులో ఉన్నాయి.

ఈ ధ్యానాన్ని చక్కగా అభ్యాసం చేసి కరుణ అనేభావనను ఎల్లలు లేకుండా ధారణ చెయ్యటం వల్ల మనిషి కరుణా పూరితుడు అవుతాడు. తప్పులు చేసిన వారిమీద అతనికి కోపం రాదు. కరుణ పెల్లుబుకుతుంది. ఇది కూడా ఒక దైవ గుణం. బోధిసత్వులందరూ ఈ కరుణా భావనతో పరిపూర్ణు లైనవారే. ఈ భావనా బలం వల్ల ఇతరుల చెడు కర్మను, రోగాలను పోగొట్టగల సంకల్ప బలం దైవీ శక్తి సాధకునికి కలుగుతాయి.

>ముదిత:

అంటే సంతోషం అని అర్థం. మంచి సంస్కార వంతులను, సంపన్నులను, ధార్మిక పరులను , ఉన్నతులను, సాధనా మార్గంలో పురోగమించిన వారిని చూచినపుడు వారి మంచి కర్మకు, పుణ్య బలానికి తానూ కూడా సంతోషం పొందటాన్ని ముదిత అని పిలవాలి. ఇదిచక్కని దైవీ గుణం.

అసూయ, ద్వేషం, ఈర్ష్య మొదలైన చీకటి గుణాలు ఈ ముదితా భావన తో పారదోల బడతాయి. ఎవరైతే సుఖంగా ఉన్నారో వారిని చూచి వారి సంతోషాన్ని తన సంతోషం గా భావించి అంతకంటే ఆనందాన్ని సంతోషాన్నిసాధకుడు ఈ భావనా బలంతో పొందగలడు. తన వద్ద ఏమీ లేకున్నాఇతరులను వారి పుణ్య బలాన్ని చూచి సంతోషంగా ఆనందం గా ఉండ గలగ టాన్ని ఈ భావనా ధ్యానం ఇస్తుంది. ఇది కూడా దేవతా లక్షణమే.

>ఉపేక్ష:ఇక దుర్మార్గులను, తనను ఎగతాళి చేసేవారిని, హాని చేసేవారిని ఈ ఉపేక్షా భావనతో విస్మరించి ఊరుకోవాలి. దీని సాధన వల్ల మనసులో ఉక్రోషం, ఏడుపు, నిస్సహాయత, కుంగిపోవటం, కోపం, కసి వంటి నిమ్న స్తాయికి చెందిన భావనలు మాయం అవుతాయి. మనసు ఆకాశం వలె నిర్మలంగా ఉండగలుగుతుంది. అన్నిటి కంటే ఈ ఉపేక్షా భావన అభ్యాసం కష్టం.

కారణం ఏమనగా ఉపేక్షా భావనలో ప్రతిష్టితుడు కావడానికి అహంకారం చాలా వరకూ తగ్గిపోవాలి. అది బలం గా ఉంటే ప్రతీకారం వంటి భావాలు పొంగి మనిషిని ఉన్మత్తున్ని చేస్తాయి. అహంకార మాలిన్యాన్ని కడిగి వెయ్యాలంటే ద్వంద్వములను సాక్షి గా చూస్తూ ఉండగల ఉపేక్షా భావనా ధ్యానంలో నిష్ణాతుడు కావాలి.

శ్రీ రామకృష్ణుని ప్రత్యక్ష శిష్యులలో ఒకరు ( రాఖాల్) స్వామి బ్రహ్మానంద. ఆయన పరివ్రాజకుడుగా దేశమంతా తిరుగుతూ ఉన్న రోజులలో హిమాలయ ప్రాంతాలలో ఉన్నపుడు ఒక సంఘటన జరిగింది. అక్కడ చలి విపరీతంగా ఉంది. స్వామి ఒక నదీ తీరం లో కూర్చొని ప్రశాంత భావం తో ఉన్నాడు. అంతలో ఒక వ్యక్తి వచ్చి ఒక కంబళిని స్వామి వద్ద ఉంచి
వెళ్ళి పోయాడు. స్వామి చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఇంకొక వ్యక్తి వచ్చి ఆ కంబళిని తీసుకొని వెళ్ళిపోయాడు. స్వామి అదే ప్రశాంత చిత్తంతో చూస్తూ ఉన్నాడు. మనసులో ఇది నాది అన్న భావన కు అతీతమైన సాక్షీ స్థితి ఈ ఉపేక్షా భావనా ధ్యానం ఇస్తుంది. దీనివల్ల సాధకుని మనస్సు ఆటు పోట్లకు చెదరని ప్రశాంత సరస్సు లాగా నిర్మలంగా ఉండగలుగుతుంది.

ఈ భావనలు అన్నీ మనస్సు పైపైన మాత్రమె కాక లోలోతులకు చొచ్చుకొని పోయి కలలో కూడా ఇతర భావనలు కలుగనంత ధ్యాన బలాన్ని సాధకుడు సంపాదించాలి. అప్పుడే వాటిలో సిద్ధత్వం కలిగినట్లు లెక్క.

మనిషి మనో మయుడు. మనస్సు వల్లనే మనిషి రాక్షసుడు అవుతున్నాడు, దేవతా అవుతున్నాడు. దీన్ని సమర్థించే అనేక శ్లోకాలు ధమ్మపదం లో మనకు కనిపిస్తాయి. భగవత్ గీత కూడా ఇదే చెబుతుంది. బంధ మోక్షాలకు మనస్సే కారణం అంటుంది. బాహ్య పరిస్తితులు ఎలా ఉన్నప్పటికీ మనస్సును అదుపులో ఉంచుకొన్న మనిషి చలించకుండా ఉండగలగటమే కాదు వాటికి సరిగా స్పందించగలడు. సరిగా స్పందించ గలిగిన శక్తి ధ్యాన బలం వల్లనే వస్తుంది.

బాహ్య పరిస్తితులకు మనం ఇచ్చే స్పందన వల్లనే మన మనస్సులో సంస్కారాలు ఏర్పడతాయి. అవే మన ఉత్తమగతికి గాని అధోగతికి గాని కారణాలు అవుతాయి. కనుక మన స్పందన వల్ల అంతిమంగా లాభపడేది లేదా నష్ట పోయేది మనమే గాని ఇతరులు గాదు.

ఈ విషయం అర్థమైతే బాహ్య పరిస్తితులకు మన స్పందన ఎలా ఉండాలి అనేదాని ప్రాముఖ్యత మనకు అర్థం అవుతుంది. ఇది అర్థం అయినప్పుడు ఈ నాలుగు బ్రహ్మ విహారాల ప్రాముఖ్యత మనకు చక్కగా తెలుస్తుంది.

ఈ నాలుగు భావనలు చాలా ముఖ్యమైనవి. కానీ వీటిని అనుసరించటం తేలికైన విషయం కాదు. దానికి ప్రతిరోజూ కనీసం ఉదయం సాయంత్రం చెరొక గంట ఈ భావనల పైన ధ్యానం అవసరం. తరువాత అనుక్షణం జీవితంలో ఎదురౌతున్న పరిస్తితులు వాటికి మన మనః స్పందనలు గమనించుకుంటూ ఉండాలి. ఇదొక సాధనా మార్గం. ఎప్పుడైతే ప్రతి పరిస్తితికీ ఈ నాలుగు స్పందనలు తప్ప ఇతర స్పందనలు మన మనస్సులో కలుగకుండా ఉంటాయో అప్పుడు మనం కొంతవరకూ ఈ సాధనలో ముందడుగు వేసినట్లు లెక్క.

ఈ భావనా ధ్యానం ఎలా చెయ్యాలి అనేదాన్ని భగవాన్ బుద్ధుడు అనేక సూత్రాలలో చక్కగా వివరంగా చెప్పాడు. కావలసిన వారు త్రిపిటకములలో ఒకటైన సూత్ర పిటకంలోని "
దీర్ఘ నికాయం " లో ఒక్కొక్క భావనా ధ్యానం పైన ఇవ్వబడిన బుద్ధుని ప్రవచనాలు చూడండి. " తేవిజ్జ సూత్ర " అనే సూత్ర భాగం లో కూడా వసిష్టుడు భరద్వాజుడు అనబడే ఇద్దరు బ్రాహ్మణులకు (వీరు ఈ గోత్ర నామంతో ఉండే మూల ఋషులు కారు) బుద్దుడు ఇచ్చిన ఉపదేశంలో ఈ బ్రహ్మ విహార భావనా ధ్యానం గురించి బుద్ధుని వివరణాత్మక ఉపదేశం చూడవచ్చు. అలాగే బుద్ధఘోషుని " విశుద్ది మార్గం " లో కూడా ఈ నాలుగు బ్రహ్మ విహార భావనా ధ్యానము గురించి అత్యంత వివరంగా ఇవ్వబడింది.
ధ్యానా భ్యాసి ఈ భావనలను అనంతంగా విస్తరించుకుంటూ పోయి నక్షత్ర మండలాలను దాటి విశ్వం లోని నలుమూలలకూ తన నుండి ఈ భావనలను ప్రసరింప చేయగల ధ్యాన శక్తిని సంపాదించాలి. అప్పుడే బ్రహ్మ విహార ధ్యాన సాధనలో పరిపూర్ణత వస్తుంది. ఏ ఇతర సాధనలు చెయ్యక పోయినా ఈ ఒక్క సాధన వల్లనే మనిషి జీవితం ధన్యతను పొందగలుగుతుంది. ఇది బుద్దుని మౌలిక బోధనలలో ముఖ్యమైన సాధన.

"పాపం - పుణ్యం - జ్ఞానం"


"పాపం - పుణ్యం - జ్ఞానం" 
ధమ్మపదం లో
బుద్ధుడు చెప్పాడు
"ఇద సోచతి, పెచ్చ సోచతి, పాపకారీ ఉభయత్థ సోచతి . .
ఇథ మోదతి, పెచ్చ మోదతి, కతపుజ్ఞ ఉభయత్థ మోదతి" (పాళీ భాష)

"పాపకర్ముడు ఇహపరాలు రెండింటిలోనూ దుఃఖిస్తాడు ;
పుణ్యకర్ముడు ఇహపరాలు రెండింటిలోనూ సుఖిస్తాడు"

పాపం            =                 అజ్ఞానం, అధర్మాచరణం వలన
పుణ్యం           =                 ధర్మాచరణం వలన
దివ్యజ్ఞానం       =                 ధ్యానం వలన
         
అధర్మాచరణ వలన ఈ లోకం లోనూ, పరలోకాల్లోనూ,
దుఃఖప్రాప్తి, మరి తిరిగి జననం కలుగుతాయి;
ధర్మాచరణం వలన ఈ లోకంలోనూ, పరలోకాల్లోనూ,
సుఖప్రాప్తి లభిస్తుంది;
అయితే, తిరిగి జననం ఖచ్చితంగా సంప్రాప్తిస్తుంది
"క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి" అన్నారు కదా గీతాచార్యులు కానీ,
దివ్యజ్ఞానప్రకాశం వలన ఈ లోకంలోనూ, పరలోకాల్లోనూ
అఖండానంద ప్రాప్తితో పాటు జన్మరాహిత్యస్థితి కూడా లభిస్తుంది 
  • కనుక, మన దినచర్యలన్నింటిలోనూ ధర్మాచరణాన్ని అవలంబిస్తూ,మిగిలిన సమయాన్ని దివ్యజ్ఞానప్రకాశ సంప్రాప్తికి వెచ్చించాలి;అలా జీవితం మొత్తం గడపాలి; అదే సరియైన జీవితం

సన్మార్గ దార్శనికుడు


గౌతమ బుద్ధుడు సన్మార్గ దార్శనికుడు
  ఆయన తనకు తాను దేవుడని ఎప్పుడూ చెప్పుకోలేదు. అవతార పురుషుణ్ణని ఎవరినీ నమ్మించలేదు. ఎటువంటి మహిమలూ చూపించలేదు. అయితేనేం ఆయన కన్నుల్లో కరుణ, పలుకులో ప్రేమ ఉట్టిపడుతుంటాయి. ఆయనే గౌతమ బుద్ధుడు. సకల సుఖాలను అనుభవించగలిగే రాజకుటుంబంలో పుట్టినా, సర్వమానవ సంక్షేమం కోసం, మానవులందరినీ దుఃఖ విముక్తులను చేయడం కోసం వాటన్నింటినీ తృణప్రాయంగా త్యజించిన త్యాగశీలత, తనలో నిండిన జ్ఞానజ్యోతులను అందరిలోనూ వెలిగించాలనే తృష్ణ ఆయనను భగవానుడిగా మార్చాయి. 



 

గౌతముడు క్రీ.పూ 563లో రాజకుటుంబంలో పుట్టాడు. సిద్ధార్థుడికి చిన్నప్పటి నుండి తాత్త్విక చింతన మెండుగా ఉండేది. ఏ ప్రాణికి ముప్పు కలిగినా, బాధ కలిగినా సహించేవాడు కాదు. అది గమనించిన గౌతముని తండ్రి శుద్ధోధనుడు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మందిరంలో గౌతముడిని పెంచాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ గౌతముడి తాతగారు వయోభారంతో అస్వస్థతకు గురవడం, క్రమంగా క్షీణించి చివరికి మరణించడం... గౌతముడిలో తిరిగి చావుపుట్టుకల గురించిన సందిగ్ధం, సంఘర్షణకు కారణమయ్యాయి. ఈ అన్వేషణలో భాగంగా దేశాటన చేశాడు. నాలుగు దఫాలుగా రాజ్యం నాలుగు దిక్కులూ పర్యటించాడు.

మూడుసార్లు గౌతముడికి రాజ్యంలో ప్రజల బాధలు, రోగాలు, మరణాలు వంటివే కనిపించాయి. ‘‘ప్రపంచం ఇంతటి విషాదంలో నిండి ఉంటే నేను వైభవోపేతమైన జీవితాన్ని అనుభవించడం ధర్మమేనా?’’ అనే ఆలోచన గౌతముని మదిలో మెదలసాగింది. ఈ నేపథ్యంలో సాగిన నాలుగో పర్యటనలో ఒక సన్యాసిని చూడడం తటస్థించింది. గౌతముడికి సమాధానం అప్పుడు దొరికింది. అప్పటి వరకు అతడి మనోసాగరంలో జరిగిన అలజడి సన్యాసి దర్శనంతో నెమ్మదించసాగింది. ఆలోచనలకు ఒక రూపం రాసాగింది. చివరికి తన 29వ ఏట అంతఃపురాన్ని వదిలి వెళ్లాడు. అప్పటి నుంచి గౌతముడి శోధన సత్యాన్వేషణకే జరిగింది. ఆ శోధనలో అనేక అంశాలను సంగ్రహించాడు.జీవించడానికి అనుసరించాల్సిన త్రిరత్నాలను బోధించాడు. అవి...

‘బుద్ధం శరణం గచ్ఛామి’
(బుద్ధి మనసుకు దారి చూపించే మార్గదర్శి)
‘ధర్మం శరణం గచ్ఛామి’
(ధర్మం అనేది మనిషి నడవాల్సిన దారి)
‘సంఘం శరణం గచ్ఛామి’
(సంఘం అంటే మనతోపాటు జీవించే తోటి మానవులతో కూడిన సమూహం)
ప్రతి ఒక్కరూ ఈ మూడింటినీ తప్పక అనుసరించాలని చెప్పాడు.

సుత్త, వినయ, అభిదమ్మ అనే త్రిపిటకాలతోపాటు జీవన విధానాన్ని సూచిస్తూ, ఆచరించకూడని వాటిని కూడా స్పష్టంగా చెప్పాడు. వాటిని ఐదు అంశాలుగా విభజించి పంచసూత్రాలుగా ఉపదేశించాడు. అవి ‘ఇతరులకు ప్రాణహాని తలపెట్టడం, వస్తువులను అపహరించడం, విశృంఖల శృంగారం, అసత్యమాడడం, మత్తుపదార్థాలను సేవించడం’.

బుద్ధుని ప్రధాన జీవన మార్గం
సత్యాన్ని పాటిస్తూ ధర్మమార్గంలో జీవిస్తూ మరణం కోసం వేచి చూడడం. అలాగని మరణంతో జీవితం ముగుస్తుందన్న వాదాన్ని అంగీకరించదు బౌద్ధం. జీవితం ఆరుదశలుగా ఉంటుందని చెబుతుంది. వీటన్నింటినీ దాటుకుని ఉత్తమదశకు చేరడం అంటే స్వర్గాన్ని చేరడమే. అక్కడ అంతా సంతోషమే ఉంటుంది. స్వర్గాన్ని చేరాలంటే ముందుగా జీవించాల్సిన ఆరు జన్మలలో తగిన అర్హతను సాధించాల్సి ఉంటుంది. ఆరు జన్మలంటే దైవత్వం, దానవత్వం, మానవత్వంతో పాటు జంతువులుగా కూడా జన్మించాల్సి ఉంటుంది. ఇవన్నీ కర్మానుసారం సంభవిస్తాయి. ఈ దశలన్నీ జీవికి దుర్భరమైన వేదనలను కలిగిస్తాయి. ఈ వేదనలకు తలవంచి మోహానికి లోబడి సత్యాసత్య, ధర్మాధర్మాలను విస్మరించకుండా జీవించడమే బౌద్ధం సూచించే జీవనశైలి.

తోటి మానవులను ప్రేమించటం, దుఃఖాలకు మూలమైన కోరికలను విడనాడటం, జీవహింస, అబద్ధాలు, దొంగతనాలు, మత్తుపదార్థాల జోలికి వెళ్లనని ప్రతిజ్ఞ చేయడం వల్ల మానవాళి వెలుగుబాటలోకి పయనించగలదని, ఆయన నమ్మాడు, ఆచరించాడు, బోధించాడు. విశ్వమానవ శ్రేయస్సు కోసం ఆయన రూపొందించిన పంచశీలాలు మానవాళికంతటికీ ఆదర్శప్రాయమైనాయి. బౌద్ధగ్రంథాలను త్రిపిటకాలు అంటారు. పిటకం అంటే గంప అని అర్థం. శ్రామికులు గంపలో మట్టిని నింపి ఒకరి చేతుల మీదుగా మరొకరు ఎలా అందుకొంటారో, అదేవిధంగా జ్ఞానజ్యోతిని భావితరాలకు వినయపిటకం, సుత్త పిటకం, అభిదమ్మ పిటకం అనే గ్రంథాల ద్వారా మానవాళికి అందించాడు.

శాంతంతో కోపాన్ని, సాత్వికతతో హింసను, దానంతో లోభాన్ని, ప్రేమతో ద్వేషాన్ని సత్యంతో అసత్యాన్ని జయించండి, సర్వప్రాణుల పట్ల సానుభూతి కలిగి ఉండటటమే నిజమైన ధర్మము లేక మతము అని ఆయన బోధించాడు. కేవలం బోధించటమే కాదు, తన బోధనలను తానే జీర్ణం చేసుకున్న మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. బుద్ధుని బోధనలు మానవుని పవిత్రమైన, ధర్మబద్ధమైన జీవనానికి దారి చూపాయి. అందుకే ఈ ప్రపంచమంతా ఆయనను అవతార పురుషునిగా భావించింది. ఆయన జన్మించి ఇన్ని సంవత్సరాలు అయినా ఆయన చూపిన మార్గం ఇంకా అనుల్లంఘనీయంగా భాసిల్లుతోంది. ఆ మార్గాన్ని అనుసరించిన ప్రతి ఒక్కరూ బౌద్ధులే. ప్రతి ఒక్కరూ బోధిసత్త్వులే.

అసలు నిజం ఇది
గౌతమ బుద్ధునిపై ఒక నింద ప్రచారంలో ఉంది. అదేమంటే అర్ధరాత్రి సమయంలో భార్య యశోధర ను, కుమారుడు రాహులుడిని వదిలి వెళ్లిపోయాడని. అది నిజం కాదు. అది కేవలం అపనింద మాత్రమే. వాస్తవానికి ఆయన తనలో సమాజ సంక్షేమం పట్ల ఎంతోకాలం నుంచి ఆలోచనలు రగులుతుండగానే తండ్రికి, భార్యకు, కుమారునికి, తాను ఇక కుటుంబ జీవనం సాగించదలచుకోలేదని, ప్రపంచ ంలోని దుఃఖాన్ని తొలగించగలిగే మార్గాలను కనుగొనేందుకు అన్వేషణ సాగించదలచానని, ఏ క్షణంలోనైనా ఆ ప్రయత్నంలో ముందుకు సాగుతానని, కాబట్టి అనుమతి ఇవ్వవలసిందని చెప్పాడు. మొదటగా వారు అంగీకరించకపోయినప్పటికీ గౌతముని పట్టుదల, దృఢసంకల్పానికి ముగ్ధులై అందుకు సమ్మతించారు. ఆ తర్వాతనే గౌతముడు అంతఃపురాన్ని వదిలి వెళ్లిపోయాడు. 
--------------------------------------------------------------

ఎప్పుడో 2555 ఏళ్ళ క్రితం చెప్పిన బుద్ధుని సిద్ధాంతాలు ఈ ఆధునిక ప్రపంచానికి చెల్లుబాటు అవుతాయా అని చాలామంది సందేహం. నాటి జీవన విధానానికి, నేటి జీవన విధానానికి అసలు పొంతన లేదు. నాడు రాచరికం ఉంటే నేడు ప్రజాస్వామ్యం ఉంది. అటు జనరిక పాలన అవినీతి, ఇటు భౌతిక సుఖలాలస జనాన్ని ఓల లాడిస్తుంటే నేటి ఈ సమాజానికి మోక్షం ఎక్కడ? అనేదానికి బుద్ధుడు చెప్పిన ఆచరణాత్మక పరిష్కార మార్గమే ధమ్మపదం. అంటే మనసే అన్నింటికి మూలం. అంటే అన్ని శక్తులలోకి మనోశక్తి బలమైంది. దీనిని సాధించాలంటే మనసు పని చేసే తీరుతెన్నులను పరిశీలించాలి. ఇది మంచి శీలం (నడత), ధ్యానం మీద ఆధారపడిన అంతరంగ పరిశీలన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.
- బుద్ధఘోషుడు (అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి),
బౌద్ధధర్మ పరిశోధకులు

దమ్మం శరణం


దమ్మం శరణం గచ్ఛామి...
బౌద్ధం ప్రపంచలోని ముఖ్యమైన మతాలలో ఒకటి. మొత్తం ప్రపంచంలో బౌద్ధధర్మాన్ని ఆచరించే వారు 23 కోట్ల నుండి 45 కోట్ల వరకు వుండవచ్చని అంచనా! ఈ బౌద్ధధర్మానికి మూల కారకులు, ఆధ్యాత్మిక గురువులలో ఒకరు... బౌద్ధులందరిచే మహాబుద్ధునిగా కీర్తింపబడినవాడు సిద్దార్థుడు. ఆయనే గౌతమ బుద్ధుడు. ఆయన బోధనలు త్రిపిటక అనే పేరుతో మూడు పీఠికలుగా విభజించి భద్రపరిచారు.

buddhaబౌద్ధధర్మాన్ని మొదటిగా బోధించిన గౌతమబుద్ధుని అసలు పేరు సిద్దార్థుడు. లుంబినిలో జన్మించి కపిలవస్తులో పెరిగాడు. తండ్రి శుద్ధోధనుడు. తల్లి మా యాదేవి.సిద్దార్థుని తాత్విక అన్వేషణ గురించి ప్రచారంలో ఉన్న కథ చూస్తే అతను పుట్టిన వెంటనే తండ్రి జ్యోతిష్కులని పిలిచి జోస్యం చెప్పమన్నారు. ఈ బాలుడు ము నుముందు గొప్ప చక్రవర్తి లేదా సర్వసంగ పరిత్యాగి అవుతాడని పండితులు చెప్ప టంతో తన కుమారునికి ఎటువంటి వైరాగ్యం కలుగరాదని కోరికతో తండ్రి అతడిని సకల భోగాలతో పెంచాడు. చిన్న వయస్సులోనే యశోధరతో వివాహం చేసాడు. తన 29వ ఏట సిద్దార్థుడు నగరంలో ప్రయాణిస్తుండగా జనులు పడుతున్న కష్టా లను..చూసాడు. అతని మనసు చలించిపోయింది. తాత్విక చింతన వైపు మరలిం ది. ఒక రాత్రివేళ కుటుంబాన్ని, రాజభోగాలను వదిలి రాజప్రసాదం నుంచి నిష్ర్క మించాడు.

సత్యాన్ని అన్వేషించటానికి కఠోరమైన దీక్షబూనాడు. బౌద్ధంలో రెండు ప్రధాన విభాగాలున్నాయి.మహాయానం; ధేరవాదం, తూర్పు ఆసి యా, టిబెటి ప్రాంతాలలో మహాయానం (వజ్రయానంతో కలిసి) ప్రాచుర్యంలో వుం ది. బుద్ధుడు బోధించిన ధర్మ సూత్రాలు బౌద్ధానికి మూలాధారం.త్రిపిటకములు* అనే శాస్త్ర గ్రంధం బౌద్ధానికి ప్రధాన ఆధారం అని విశ్వసిస్తారు. ఇందుకు అదనంగా మహాయాన బుద్ధులు మహాయాన సూత్రాలు* అనే రచనను విశ్వసి స్తారు.

ధేరవాద బౌద్ధంలో- జన్మజన్మల వేదన, సాధన అనంతరం సత్యాన్ని తెలిసికొని అజ్ఞానాంధకారం నుండి బయటపడి, ఇతరులకు ఆ మార్గాన్ని ఉపదేశించిన వారు బుద్ధులు అవుతారు. సత్యాన్ని తెలిసికొన్నగాని ఇతరులకు ఉపదేశం చే యనివారు ప్రత్యేక బుద్ధులవుతారు*. శాక్యముని గౌతమబుద్ధుడు ఒక్కడు ఒక్క డే బుద్ధుడు కాదు. అంతకు పూర్వం ఇంకా ముందు కాలంలో ఎందరో బుద్ధు లుంటారు. సత్యా న్ని తెలుసుకున్న గౌతమబుద్ధుడు అనేక బుద్ధులలో ఒకడు. బుద్ధుని బోధనలో నాలుగు ఆర్య సత్యాలు ప్రముఖపాత్ర కలిగివున్నాయి. వాటితో పాటు అష్టాంగ మా ర్గం* కూడా!! బుద్ధుని అనంతరం బౌద్ధాన్ని ఆచరించే వారిలో అనేక విభాగాలు ఏర్ప డినాయి. వాటి ఆచరణ, సిద్ధాంతాలలో, సంస్కృతిలోనూ నెలకొన్న వైవిధ్యం కార ణంగా బౌద్ధం అంటే ఇది అని స్పష్టంగా అందరికీ వర్తించే విషయాలు క్రోడీ రించడం కష్టమవుతున్నది.

బోధి... :
బోధి అనగా నిద్రలేచుట*. థేరవాదంలో అరహంతులకు, బుద్ధులకు కూడా జ్ఞానోదయమయ్యే ప్రక్రియను బోధి అంటారు. బౌద్ధం ఆరంభంలో బోధి; నిర్వాణం* అనే పదాలు ఒకే అర్థంలో వాడబడ్డాయి. రాగ, ద్వేష, మోహాలు అంతరిం చటం ఈ ప్రక్రియలో ముఖ్యమైన లక్షణం. తరువాత వచ్చిన మహాయాన సిద్ధాంతా లలో నిర్వాణం* అనే స్థితి బుద్ధత్వం కన్న కొంత తగ్గింది. రాగ, ద్వేషాల నుండి వి ముక్తి కలిగితే అది నిర్వాణం అవుతుంది. అనగా ఇంకా మోహం వుంటుంది. ఈ మోహం కూడా తొలిగితే బోధి* స్థితి వస్తుంది.

మహాయానంలోని ఈ సిద్ధాంతం ప్రకారం అరహంతులు నిర్వాణాన్ని పొందుతారు కాని ఇంకా మోహం నుండి విము క్తులు కానందున వారు బోధిత్వం పొందరు. కాని ధేరవాదంలో నమ్మకం ప్రకారం అరహంతులు రాగ, ద్వేష, మోహాల నుండి విముక్తి పొందిన బోధులు. బోధిత్వం పొందటానికి నాలుగు ఆర్యసత్యాలను తెలుసుకోవాలి; బోధిత్వం పొందినవారు జనన, మరణ, పునర్జన్మ, సంసారచక్రం నుండి విముక్తి పొందుతారు. మాయ తొలగి అనాత్మత* అనే సత్యం తెలుసుకుంటారు.

మధ్యే మార్గం... :
బౌద్ధ మతం సాంప్రదాయాలలో, విశ్వాసలలోనూ మధ్యే మా ర్గం ముఖ్యమైన స్థానంగలది. గౌతముడు తన జ్ఞానోదయానికి ముందు ఈ మార్గాన్ని అవగతం చేసుకున్నాడు అని ప్రతీతి. వివరణలు చూస్తే...
  • కఠోరమైన దీక్షతో మన శరీరాన్ని, మనసుని కష్టపెట్టకుండా, భోగలాల సత్వంలో మునిగిపోకుండా మధ్య విధంగా సాధన, జీవితం కొనసాగించటం.
  • తత్వచింతనలో పిడివాదనలు లేకుండా మధ్యస్థంగా ఆలోచించటం.
  • నిర్వాణంలో విరుద్ధ భావాలు అంతమై పరిపూర్ణమైన జ్ఞానం కలగడం.


  • త్రిరత్నాలు...:
    త్రిరత్నాలు లేదా రత్నత్రయం శరణు జొచ్చుట బౌద్ధం ఆచరణలో ప్రాధమిక ప్రక్రియ. అసలు త్రిరత్నాలు అంటే
    బుద్ధుడు: జ్ఞానోదయమైన, ధర్మమార్గాన్ని ఎరిగిన అరహంతుల మార్గాన్ని ఆచ రించడం. ధర్మం: బుద్ధుడు తెలిపిన మార్గం. సత్యం, అసత్యానికి ఉన్న బేధము పర మ సత్యం. సంఘం: బౌద్ధ భిక్షువుల సమూహం లేదా సత్యాన్వేషణలో పురోగమి స్తున్న వారి సహవాసం. బిక్షుకుల సాధనకు సహకరిస్తున్న సామాన్య జనులు కూడా సంఘం లోని వారే!
    బుద్ధుడు తాను కనుగొన్న మార్గాన్ని ఇతరులు గ్రుడ్డిగా ఆచరించమని చెప్పలేదు. శ్రద్ధతో ఎవరికి వారే తాను బోధించిన ధర్మాన్ని ఆలంబనగా చేసుకొని యుక్తా యుక్తం విచారించి సంఘం సహకారంతో సత్యం తెలుసుకోవాలి అని చెప్పాడు. బుద్ధుడు బోధించిన ధర్మాన్ని అందరికీ అందుబాటులో వుంచేది సంఘం!!!

    నాలుగు మహోన్నత సత్యాలు:
    1. దుఃఖం 2. దుఃఖానికి కారణం 3. దుః ఖం నుంచి విముక్తి 4. దుఃఖం నుంచి ముక్తిని పొందే మార్గం! బౌద్ధమతం లో పై నాలు గు పరమసత్యాలు ప్రవచింపబడ్డాయి. ఇవి గౌతమ బుద్ధుడు తన జ్ఞానోదయం తర్వాత తన సహసాధకులకి చెప్పిన విషయాలు కనుక బుద్ధుని మొదటి బోధనలు.ధర్మచక్ర పరివర్తన సూత్రం అనే బుద్ధుని మొదటి బోధలో బుద్ధుడు మధ్యేమార్గం గురించి; అష్టాంగ సాధన మార్గం గురించి, నాలుగు పరమ సత్యాల గురించి చెప్పా డు. అయితే వీటిని అప్పటి కాలంలో కష్టాలు తీర్చే మార్గంగా చెప్పాడు.

    అష్టాంగ మార్గం...
    నాలుగు పరమ సత్యాలలో నాలుగవదైన దుఃఖ విమోచన మార్గం అష్టాంగమార్గం. ఆరంభ దశలో ఇది సామాన్యులకు బోధించే వారుకాదు.
    శీలము: శరీరం, మాటల ద్వారా చెడును కలుగనీయకుండుట.
    సమాధి: మనసుని అదుపులోకి తెచ్చుకోవడం. ఇందులో మూడు.
    ప్రజ్ఞ: మనసుని శుద్ధపరిచే జ్ఞానం. ఇందులో రెండు అంగాలున్నాయి.సమ్యక్‌ దృష్టి - భ్రమపడకుండా ఉన్నది ఉన్నట్లుగా చూడగలగటం.
    సమ్యక్‌ సంకల్పం - ఆలోచించే విధానంలో మార్పు.

    మహాయానంలో బుద్ధుడు అంటే ఒక వ్యక్తి కాదు. అనంతమైన ధర్మరూపం. కొన్ని మహాయాన సూత్రాలలో బుద్ధుడు ధర్మము, సంఘం అనే మూడు భావాలు అవినా భావమైన శాశ్వతత్వానికి ప్రతీకలు.మహాయానంలో కొన్ని సూత్రాల ప్రకారం శ్రవ ణం, మననం వంటి సాధనల ద్వారా కర్మబంధాల నుంచి విముక్తి కలుగవచ్చు. అ ష్టాంగమార్గం ద్వారానే దుఃఖభూయిష్టమైన కర్మల నుంచి విమోచన కలుగుతుంది.

    ఆంధ్రప్రదేశ్‌లో బౌద్ధం...
    బౌద్ధమతం ప్రారంభ దశ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో విశేషంగా ఆదరించబడింది. అశోకుని శిలా శాసనం బట్టి ఆంధ్రప్రవేశ్‌ అప్పటికే ధర్మ విషయంలో వుంది. గుంటుపల్లి, భట్టిప్రాలు, వంటి బౌద్ధక్షేత్రాలు హీనయాన బౌద్ధకాలంనాటివి. అసలు బుద్ధుడే భట్టిప్రోలు సందర్శించాడని ఒక అభిప్రాయం. అశోకుని, శాతవాహనుల కాలంలో రాజ కుటుంబాలు విశేషంగా ఆదరించాయి బౌ ద్ధాన్ని! ధరణికోట, విజయపురి వంటి మహారామాలు ఆంధ్రదేశంలో బౌద్ధం అత్యు న్నత స్థాయికి ఉన్న నాటి చిహ్నాలు! మహాయానం ఆంధ్రప్రదేశంలోని నాగార్జునుని తత్వంతో ప్రావర్భవించింది.

    గౌతమబుద్ధుని జాతక విశ్లేషణ...
    కర్కాటక లగ్నం, తులా రాశిలో జన్మించాడు గౌతమ బుద్ధుడు. గురు దశాశేషం దాదాపు 15 సం వుంది.కర్కాటక లగ్నం సహజంగానే ఆధ్యాత్మిక లగ్నంగా చెప్తాం. లగ్నానికి లగ్నాధిపతి చంద్రుడు. కుజుడు రాజయోగం. భాగ్యరాజ్యాధిపతుల కలయిక వలన ధర్మకర్మధిపయోగం. పంచమ, షష్టాధిపతులైన కుజ, గురుల కలయిక వలన అలౌకిక శక్తుల వృద్ధి. పంచమ, నవ మాధిపతుల సంబంధం ఆధ్యాత్మిక స్ఫూర్తి.

    లగ్నధిపతిని రాజ్యస్థానం నుంచి గురు, రవి, కుజ, శని, శుక్ర వీక్షణ. అందులోను చంద్రుడు గురునిన త్రంలో శుక్రుని ఇంట (పౌర్ణమి) వుండి చతుర్థ, లాభాధిపతియైన శుక్రుని వీక్షణ, సప్తమాధిపతి అష్ట మాధిపతి శని; షష్ట భాగ్యాధిపతి గురువు; రవి, కుజ దృష్టుల వలన రాజయో గం,ఎవరి జాతకంలోనైనా నాలుగు గ్రహాలకి మించి కలిసుంటే వారు పరివ్రాజక యోగం కలవారని తెలుస్తుంది.బుద్ధుడు పుట్టిన తర్వాత కష్టం తెలియకుండా పెరగటం, మనసు కష్టం కలిగిన దృ శ్యాలు చూసి చలించిపోయి ఇంటి నుండి వెళ్ళటం మొ అంశాలు పరిశీలిస్తే భాగ్య స్థానాధిపతి అయిన గురుని దశ అతని చిన్నతనంలో నడిచింది. (లగ్నధిపతి చంద్రు ని, గురుడు చూడటం). అలాగే అతనికి శని దశ శని అంత ర్దశలో యశోధరతో వి వాహం; (శని సప్తమాధిపతి); కుజుని అంతర్దశలో (కుజుడు పంచమాధిపతి) రా హుల్‌ జన్మించటం; శని/రాహు దశలో ఇంటి నుంచి వెళ్లపోవటం (శని వైరాగ్యకార కుడు). అలాగే గురు అంతర్దశలో, బుధుని అంతర్దశలలో తపస్సులు, హఠయో గాలు, ఆసనాలు, ప్రాణాయామాలు చేసి ధ్యానం సమాధి స్థితి పొందటం జరిగింది.

    బుధుని దశలో (బుధుడు వ్యయాధిపతి, లాభంలో ఉన్న బాధకుడు కనుక) మధ్యే మార్గంగా, అష్టాంగ మార్గాలు, శారీరకంగా అలసటని పొందటం మొ జరిగాయి. ఆ తర్వాత కేతు దశలో కూడా ప్రచారాలు, బౌద్ధకులం సంబంధించిన అంశాలు, శుక్రదశ 20 సంలు (శుక్ర, శని, కుజ, రవి, గురు కలయికచే) ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు, సంఘములు స్థాపన, బౌద్ధభిక్షువులను తన శిష్యులుగా స్వీకరిం చి భారతదేశం అంతా విస్తరింప చేశారు. సంక్షిప్తంగా చూస్తే గౌతమబుద్ధుని జాతకం లో రాజయోగాలు, సన్యాసయోగాలు వున్నాయి. గజకేసరి యోగం; హఠయోగం; చంద్రమంగళ యోగం; ధర్మకర్మాదిప యోగం;... ఇలా ఎన్నో వున్నాయి. అన్నీటికీ మించి పరివ్రాజక యోగం వున్నది. దాని వలన ఆ వ్యక్తి జీవితంలో ఎన్ని భోగాలు అనుభవించటానికి అవకాశం వున్నా అన్నీ త్యజించి సన్యాసం స్వీకరించి భవబంధా లకి దూరంగా వుండిపోతారు. మహారాజ బిడ్డగా మహా యోగాలతో పుట్టుకతోనే మహారాజుగా పుట్టినా బుద్ధుడు చివరికి సర్వసంగ పరిత్యాగిగా మారటం... పరివ్రాజకయోగమే!!