23, జనవరి 2013, బుధవారం

బుద్ధుని బోధనలు

బుద్ధుని బోధనలు

గౌతమ బుద్దుడు అనుత్తర సమ్యక్ సంబోధిని పొందిన రోజు వైశాఖ పూర్ణిమ. రోజు బౌద్ధులకు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకనగా రోజున బుద్ధుని జననము, జ్ఞానోదయము, పరినిర్వాణము జరిగాయి. పున్నమి చంద్రుడు ఎలాగైతే తన చల్లని వెలుగును లోకానికి వేదజల్లాడో బుద్ధుడు తానూ కనుగొన్న దుఃఖ నాశన మార్గాన్ని లోకానికి దాదాపు 40 ఏళ్ళు బోధించి పరినిర్వాణం చెందాడు.
భగవాన్
బుద్ధుడు కనుగొని లోకానికి బోధించిన జ్ఞానం ఏమిటి? దీనిని క్లుప్తంగా రెండు మాటలలో చెప్ప వచ్చు.
1.
నాలుగు ఆర్య సత్యములు
2.
ఆర్య అష్టాంగ మార్గము
భగవాన్ బుద్ధుడు తాను పొందిన జ్ఞానాన్ని గురించి చాలా చోట్ల వివరించే టపుడు అది రెండు విధాలుగా ఉన్నదని చెప్పాడు.ఒకటి- నాలుగు ఆర్య సత్యములను దర్శించుట.రెండవది- ప్రతీత్య సముత్పాద నియమమును దర్శించుట.
నాలుగు
ఆర్య సత్యములు.
1.
దుఃఖము సత్యము
2.
దుఃఖ కారణము సత్యము
3.
దుఃఖ నాశనము సత్యము
4.
దుఃఖ నాశన మార్గము సత్యము.
ఆర్య అష్టాంగ మార్గము.
1.
సమ్యక్ దృష్టి
2.
సమ్యక్ సంకల్పం
3.
సమ్యక్ వాక్
4.
సమ్యక్ కర్మ
5.
సమ్యక్ ఆజీవం
6.
సమ్యక్ వ్యాయామం
7.
సమ్యక్ స్మృతి
8.
సమ్యక్ సమాధి
ఇవి తిరిగి శీల, సమాధి, ప్రజ్ఞలుగా విభజింప బడినవి. వీటిలో ఒక్కొక్కటి వివరంగా చూద్దాము. అపుడు బుద్ధుని దర్శనము, చింతన, బోధనలు స్పష్టంగా అర్థం చేసుకొనడానికి వీలవుతుంది
 అస్సజి బుద్దుని మొదటి అయిదుగురు శిష్యులలో ఒకడు. మిగిలిన నలుగురు భద్దియ, కొండన్న, మహానామ,వప్ప. వీరు బుద్ధుడు నిరాహారిగా ఉంటూ తీవ్ర సాధనాలు చేస్తున్న సమయంలో ఆయనను అనుసరించి ఉండేవారు. ఆహారంమానేసి శరీరాన్ని కృశింప చేసి ఇంద్రియ దాస్యం నుంచి ముక్తి పొందటమే మోక్షం అని ఒక భావన కాలంలో ఉండేది. కాని బుద్దుడు ఇది తప్పు అని స్వానుభవం ద్వారా తెలిసుకొని ఆహారాన్ని తీసుకోవటం ప్రారంభం చేస్తాడు. ఇది చూచి అయిదుగురు భిక్షువులూ ఆయన సాధనా మార్గంలో భ్రష్టుడై నాడని తలచి, విడచి తమ మార్గాన పోతారు.

తరువాత కొంత కాలానికి బుద్దుడు జ్ఞానోదయాన్ని పొంది, తానూ కనుగొన్న మార్గాన్ని లోకులలో ఎవరికీ బోధించాలిఅని దివ్య దృష్టి తో చూస్తాడు. తాను ఒకప్పుడు శిష్యరికం చేసిన గురువులైన అలార కలాముడు, ఉద్డక రామ పుత్రుడుఅనేవారు గతించారన్న విషయాన్ని దివ్య చక్షువుతో చూచి, తన అనుచరులైన అయిదుగురు భిక్షువులు కాశీసమీపంలోని సారనాథ్ వద్ద ఉన్నారని గ్రహిస్తాడు.

తరువాత వారికి చేసిన బోధనే ధర్మ చక్ర ప్రవర్తనం అంటారు. విధం గా బుద్ధ ధర్మం ప్రచారంలోకి వచ్చింది. అయిదుగురు శిష్యులలోని వాడే అస్సజి లేక అశ్వజిత్ అనే భిక్షువు. తరువాత వీరందరూ బుద్ధుడు చెప్పిన మార్గాన్నిసాధన చేసి బుద్ధత్వాన్ని పొందారు.

అస్సజి వద్దకు సారిపుత్రుడు వచ్చి బుద్ధుని బోధనలు ఏవి? ఆయన కనుగొన్న మార్గం యొక్క వివరాలు ఏమిటి ? అని ప్రశ్నిస్తాడు. దానికి అస్సజి " అయ్యా, నేను జ్ఞానములో అంత పండితుడను కాను. బుద్ధుడు కనుగొన్న మార్గంయొక్క వివరాలు నాకు పూర్తిగా తెలియవు. కాని స్థూలంగా చెప్పగలను. జీవులకు కలిగే దుఖం యొక్క కారణాలు, కారణాలను నిర్మూలించే మార్గం ఆయన కనుగొన్నాడు". అని చెబుతాడు. దానికి సారిపుత్రుడు ఆనంద భరితుడైమౌద్గాల్యాయనుని తో కలసి బుద్ధ ధర్మాన్ని స్వీకరిస్తాడు.

అస్సజి బుద్ధుని మార్గాన్ని చక్కగా నిర్వచించాడు. ఎవరైనా బుద్ధ ధర్మమును గురించి చెప్పవలెనంటే ఇంతకంటేక్లుప్తముగా చక్కగా చెప్పటం కష్టం. బుద్ధుని సమస్త బోధల సారాంశం ఇందులో ఇమిడి ఉన్నది.
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి